నంద్యాల పట్టణంలోని 8వ వార్డులో 145 వ రోజు గురువారం ''గడపగడపకు మన ప్రభుత్వం ''కార్యక్రమం వార్డు ఇంచార్జ్ నిజాంఖాన్ కౌన్సిలర్ తౌహీద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కి ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు.మహిళలు హారతులు ఇచ్చి, ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.. వార్డు ప్రజలు ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డిని ఆప్యాయంగా పలకరిస్తూ , ఆయనకు వెన్ను దన్నుగా నిలబడ్డారు. అయన మళ్లీ2వ సారి ఎమ్మెల్యేగా గెలవాలని, ఆకాంక్షించారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ కరపత్రాలను ఎమ్మెల్యేల లబ్ధిదారులకు అందించారు..
ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి ముందుకు సాగుతుందని ముఖ్యంగా నంద్యాల నియోజకవర్గంలో పట్టణంలో తాగునీటి సమస్యతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడే వారిని ఇప్పుడు ఆ పరిస్థితిని అధిగమించి అమృత్ స్కీం ద్వారా మంచినీటిని వెలుగోడు నుంచి నంద్యాలకు వచ్చే విధంగా ఏర్పాటు చేశామన్నారు అలాగే విద్యా వైద్యానికి పెద్ద పీట వేస్తూ నూతన మెడికల్ కాలేజీలో విద్యార్థులు విద్యను ప్రారంభించడం నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించిన ఘనత ఒక జగనన్నకే దక్కుతుందన్నారు గతంలో ఏ నాయకుడు కూడా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకునే విధంగా ఎవరు చేయలేదని జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఉద్దేశంతో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు వారి సమస్యలను కూడా తెలుసుకొని వాటిని పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు వచ్చే ఎన్నికలలో కూడా ప్రజలందరూ వైయస్ఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మా బున్నీసా, వార్డు వైసిపి నాయకులు గన్ని బ్యాగ్స్ షేక్ష, ఆమిన్, హుస్సేన్సా, రియాజ్,సలీమ్,రషీద్,దాసరి మహేష్, కాల్వ ఆదినారాయణ ,కాశీం, ఫరూక్, మాలిక్ భాష, ఖాజా ఖాన్ , అన్వర్, ఆర్టీసీ వలి ,రసూల్,షఫీ, వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ కోఆప్షన్ సభ్యులు వార్డు ఇన్చార్జులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు

[zombify_post]