సంతబొమ్మాళి మండల కేంద్రానికి ఆనుకొనివున్న వెంకటాపురం గ్రామంలో లో ఓల్టేజ్ సమస్య వెంటాడుతోంది. చాలా ఏళ్ళ తరబడి ఈ గ్రామానికి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు పాతనే దర్శనమిస్తున్నాయి. వాటి స్థానంలో నేటికీ కొత్తవి అమర్చబడలేదు. దాని వలన గ్రామంలో విద్యుత్ లోఓల్టేజ్ సమస్య అధికంగా ఉంటుందని, ఎప్పటికప్పుడు విద్యుత్ కోతలు కూడా అధికంగా ఉంటున్నాయని గ్రామస్తులు తెలిపారు. అలాగే న్న విద్యుత్ సరఫరా లైన్ కు మెరుగైన విద్యుత్ సరఫరా కోసం కొత్త ట్రాన్స్ ఫార్మర్ ను అనుసంధానం చేస్తే బాగుంటుందని గ్రామస్తులు అంటున్నారు. ఈ విషయం పై విద్యుత్ శాఖ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి సమస్యను తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాను.
[zombify_post]