రామభద్రపురం: ఉపాధ్యాయులే భావి సమాజ
నిర్దేశకులు

ఉపాధ్యాయులే భావి సమాజ నిర్మాతలు, నిర్దేశకులని రోటరీ క్లబ్ అధ్యక్షులు జె. సి రాజు అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నాయుడు వలస పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్వేపల్లి చిత్రపటానికి జె. సి రాజు, హెచ్. ఎం నాగభూషణం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులను. జె. సి రాజు, విద్యార్థులు కలిసి .వారిని సత్కరించి గుర్తుగా బహుమతులు అందజేశారు .పిల్లల్ని బాగా చదువుకోమని ఉన్నత స్థాయికి ఎదగాలని వాళ్ళని ఆశీర్వదించారు.
[zombify_post]