రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానం సమావేశం మందిరంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు,సనాతన హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, ఇతర హిందూ బంధువులు, మండప నిర్వహకులు, ప్రజాప్రతినిధులతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ సహకరించినప్పుడే జిల్లా ప్రశాంత వాతావరణంలో అన్ని పండుగలను అన్ని మతాలకు, కులాలకు అనుగుణంగా, సమరస్యతతో విజయవంతంగా నిర్వహించవచ్చునని తెలిపారు.
[zombify_post]