తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు గురువారం శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.
బుధవారం రోజున 75,804 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నేడు శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు జరుగనున్నాయి…

[zombify_post]