*ఆదోని నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న ప్రతి వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని జర్నలిస్ట్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ ( జాప్ ) జిల్లా సహాయ కార్యదర్శి మందుల వెంకటేష్,ఆదోని డివిజన్ జాప్ కమిటీ నాయకులు లీగల్ అడ్వైజర్ సాయికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఎమ్మార్వో వెంకటలక్ష్మి గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ………….. ప్రభుత్వానికి ప్రజలకు వారది గా ఉన్న జర్నలిస్టు లకు ఇంటి స్థలాలను ఇవ్వాలని అందుకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ఇంటి స్థలాలు కేటాయించలని వారు కోరారు.స్పందించిన తహసిల్దార్ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) జిల్లా సహాయ కార్యదర్శి మందుల వెంకటేష్ , సీనియర్ జర్నలిస్ట్ లీగల్ అడ్వైజర్ సాయి కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రకాష్ ,మరియు జర్నలిస్టులు గౌస్,చంద్ర శేఖర్, గోపాల్ రెడ్డి,ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!