గురు న్యూస్ విశాఖపట్నం : ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖ పరిపాలనా కేంద్రంగా వర్ధిల్లాలని,రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని అన్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త రాష్ట్ర నేడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు.ఈ సందర్బంగా ఉమ్మడి ఉత్తరాంధ్రలో దేవాలయాలు సందర్శన యాత్ర జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ హనుమతు లజపతి రాయ్ గారు ఆధ్వర్యంలో జరిగిన దేవాలయాల సందర్శన యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా,విశాఖపట్నం సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుండి దేవాలయాలు సందర్శన కొరకు యాత్ర మొదలుపెట్టి అనంతరం శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు దేవాలయంకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు, కేకే రాజు.ఈ కార్యక్రమం లో విశాఖ నగర మేయర్ గోలగాని హరిణి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!