వ్యవసాయ రంగ రూపురేఖలు మార్చిన మహనీయులు, హరిత విప్లవ పితామహుడు,కీర్తిశేషులు పద్మభూషణ్, పద్మవిభూషణ్, డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ గారికి సీపీఐ ఆధ్వర్యంలో ఆదోని కార్యాలయంలో నివాళులర్పించడం జరిగింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.రామచంద్రయ్య గారు, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య గారు మాట్లాడుతూ…………ఆహార భద్రత, రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన చేసిన కృషికి ఫలితమే ఇవాళ భారతదేశం అతిపెద్ద ధాన్యాగారంలా ఉందని అన్నారు. చిన్న రైతులు చిన్న చిన్న భూముల్లో కూడా ఎక్కువ పంట దిగుబడి సాధించేందుకు ఆయన పరిశోధనలు ఉపయోగపడ్డాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. మునెప్ప గారు, అజయ్ బాబు గారు, సీపీఐ, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!