
సంఘ భవనానికి ముగ్గుపోస్తున్న – ఎంపీపీ ముత్యాల కరుణ శ్రీ – బలరాం రెడ్డి
ధర్మారం. సెప్టెంబర్ 21 గురు న్యూస్ : పెద్దపెల్లి జిల్లాలోని ధర్మారం మండలం న్యూ కొత్తపల్లి గ్రామంలో గంగపుత్ర సంఘం భవన నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఐదు లక్షల ప్రోసిడింగ్ ను గంగపుత్రులకు అందించారు. ఈరోజు గురువారం రోజున గంగపుత్ర సంఘం అధ్యక్షుడు కూనారపు రాజయ్య ఆధ్వర్యంలో ఎంపీపీ ముత్యాల కరుణ శ్రీ – బలరాం రెడ్డి, సంఘ భవన నిర్మాణం కోసం భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ ముత్యాల కారుణశ్రీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారని అన్నారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, అన్ని వర్గాల కుల సంఘ భవనాల నిర్మాణ నిర్మాణం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దార మల్లమ్మ, ఎంపిటిసి సురమళ్ళ శ్రీనివాస్, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జుంజిపెళ్లి సురేందర్, బీసీ సెల్ అధ్యక్షుడు నందాల మల్లేశం, వార్డు సభ్యులు కోఆప్షన్ నెంబర్స్ మరియు గంగపుత్రులు తదితరులు పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!
