తిరుమల లో బోనులో చిక్కిన రెండు చిరుతలను అధికారులు వదిలి పెట్టారు. గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యంలో ఒక చిరుతను, విశాఖపట్నం ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు మరో చిరుతను ఫారెస్ట్ అధికారులు తరలించారు. బాలిక లక్షిత మరణించిన స్థలంలో సేకరించిన నమూనాలతో IISER సైంటిస్టులు పోల్చి చూశారు. పాపను చంపిన చిరుతలు అవి కాదని నిర్ధారించారు.
