- న్యూస్ టుడే, విశాఖపట్నం : పేదవాడి ఆకలి తీర్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని వైసీపీ తూర్పు సమాన్వయ కర్త నేడ్ కాప్ చైర్మన్, శ్రీ కే కే రాజు గారు అన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం 53 వ వార్డ్ NH-16, ఆర్ &బి జంక్షన్ బస్ స్టాప్ శ్రీరామ్ నగర్ వద్ద మోప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహా క్యాంటిన్ ని ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ క్యాంటిన్ ద్వారా పేదల ఆకలి తీర్చేందుకు, అలాగే పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చేవారి పేదల ఆకలి తీర్చేందుకు ఈ క్యాంటీన్ఏ ర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు, ఈ క్యాంటిన్లో భాగంగా, వెజిటేరియన్, కరివేపాకు సాంబార్, ఆవకాయ రైస్, పెరుగున్నాం తదితర ఆహారం అందిస్తారన్నారు.
[zombify_post]
