మహాభారతం చెప్పిన మంత్రి హరీష్ రావు గారు. కౌరవులు ఎక్కడా గెలువరు. ధర్మం పాటించిన పాండవులే గెలుస్తారని, రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే కురుక్షేత్రంలో గెలిచేది ధర్మం. కాంగ్రెస్ కౌరవుల పార్టీ. అభివృద్ధి గెలవాలా..? అబద్ధం గెలవాలా.? అనే దానిపైనే మధ్య పోటీ ఉంది. ఏన్నో అద్భుతమైన విజయాలకు, దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం ఉన్నదని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు గారు చెప్పారు.
పూటకొక దొంగ డిక్లరేషన్ చేసే కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మరు. మూడవ సారి కూడా సీఎం కేసీఆర్ అని తెలంగాణ ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. హైదరాబాదులో కాంగ్రెస్ ఏఐసీసీ మీటింగ్ పెడ్తదట. ఇక అన్నీ అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారని, 60 ఏళ్లు పాలించి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదో ముందు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో సిద్ధిపేట, దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని 7200 మంది మత్స్యకారులకు మంత్రుల చేతుల మీదుగా గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు గారు మాట్లాడుతూ..
తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. వచ్చే ఎన్నికల్లో విజయాలకు, అబద్ధాలకు మధ్య పోటీ ఉన్నదని మంత్రి ఘాటుగా విమర్శించారు.
గతంలో మత్స్యకారులకు సభ్యత్వం దొరకడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి హరీశ్ వెల్లడించారు.
దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గ గంగపుత్రులకు రాష్ట్రంలోనే మొదటిసారి గుర్తింపు కార్డులు సిద్దిపేట లో ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
గుర్తింపు కార్డులతో అన్నీ రకాల ఉపయోగం ఉంటుందని, కోరిన వెంటనే నిర్ణయం తీసుకుని రాష్ట్రమంతా ఇద్దామని, సిద్ధిపేటతో 8 వేల మందికి కార్డులు పంపిణీతో కార్యక్రమం ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.దేశంలోనే ఎక్కడా లేని విధంగా 2 వేల కోట్ల రూపాయలతో మత్స్యకారుల సంక్షేమానికి ఖర్చు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కొన్ని చెరువులలో సబ్సిడీపై చేప పిల్లలు వేసేవారని, రాష్ట్రంలోని అన్నీ చెరువులలో ఉచితంగా వంద శాతం సబ్సిడీతో మనమే ఇస్తున్నట్లు మంత్రి వెల్లడి. గతంలో చేపలు దిగుమతి అయ్యేవి. మృగశిర కార్తె వస్తే పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకునే పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణలో సీన్ రివర్స్ అయ్యిందని పుష్కలంగా చేపలు వచ్చినయ్.
మిషన్ కాకతీయతో నీళ్ల కరువు లేదు. ఇవాళ నీళ్లు ఫుల్, చేపలు కరువు లేదు. చేపలు ఫుల్ వచ్చినయని, గంగపుత్రుల జీవితంలో వెలుగులు నిండాయని స్పష్టం చేశారు. సిద్దిపేట నుంచి విజయవాడ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ కు చేపలు ఎగుమతి అవడం గర్వ కారణమని పేర్కొన్నారు.
మంత్రుల వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఫెడరేషన్ వైస్ ఛైర్మన్ డీటీ.మల్లయ్య, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]