ఆదర్శప్రాయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ అని మందస మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి తిరుమల రావు, ఎం ఈ ఓ 1,2 లు ఎం లక్ష్మణరావు,భాస్కర రావులు కొనియాడారు. మంగళవారం మండల విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు అధికారులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని సూచించారు. సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఈ ఓ పి ఆర్ డి జయప్రకాష్, ఏపీవో హరికృష్ణ, స్వచ్ఛభారత్ మండల రీసెర్జ్ కోఆర్డినేటర్ ఎం. సిహెచ్ శ్రీనివాసరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]