Revanth Reddy: కాంగ్రెస్ నేతల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు
హైదరాబాద్: కాంగ్రెస్ నేతల ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ( BRS Govt ) హ్యాక్ చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ( Revanth Reddy ) అన్నారు..
మంగళవారం నాడు ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ”స్పైవేర్ని ఉపయోగించి మా ఫోన్లను అక్రమంగా హ్యాక్ చేస్తున్నారు. ఇది గోప్యత, మానవ గౌరవం, రాజకీయ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. కానీ ఏదీ మనల్ని అడ్డుకోదు. మా చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రజల కోసం పోరాడుతాం. కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రాధాన్యత ప్రజల హక్కులు, న్యాయం కోసం పోరాడడమే. తెలంగాణ ప్రజల కోసం రాజీ లేకుండా పోరాడుతున్నాం” అని రేవంత్రెడ్డి ట్విట్ చేశారు..

This post was created with our nice and easy submission form. Create your post!