సిద్దిపేట:
వైద్య రంగంలో ఫార్మసీస్ట్ ల పాత్ర కీలకమని ఇంచార్జ్ డియెఎంహెచ్ఓ డాక్టర్ రజని అన్నారు. ప్రపంచ ఫార్మసీస్ట్ డే సందర్బంగా సోమవారం టీఎంజి ఓ మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ప్రతిభ కనబర్చిన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ కారోన సమయంలో ఫార్మసిస్టు ల పాత్ర చాలా కీలక భూమిని పోషించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫార్మసిస్ట్ ప్రభాకర్ phc దౌల్తాబాద్ గారు మాట్లాడుతూ ఫార్మసిస్ట్ ల పాత్ర వైద్యరంగంలో చాలా కీలకమైందని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన tngos మెడికల్ అండ్ హెల్త్ ఫోరం అధ్యక్షులు సుతారి శ్రీధర్ బాబు,కార్యదర్శి జి వెంకటేశ్వరరావు గారిని ప్రశంసించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డా. చంద్రశేఖర్, డా. నాగరాజు,అశ్వత్ అహ్మద్, కృష్ణమూర్తి,నాగజ్యోతి, కాల్వ చక్రధర్ ,జాకీర్ హుస్సేన్ ,పోతుల అనిల్డా. ఆకుల సంజీవరెడ్డి మరియు జిల్లా ఫార్మసిస్ట్ లు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!
