స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగిందా? లేదా? అనేది స్పష్టత లేదని, విషయం ఏంటో కూడా చెప్పకుండానే ఎలా అరెస్టు చేస్తారని బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన.. ఇప్పటి వరకు నిషేధించకపోగా.. మరింతగా ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. మద్యం ద్వారా వేల కోట్ల అవినీతి జరుగుతుందనేది నిజమన్నారు. కొత్త బ్రాండ్లను తెచ్చి ప్రజల రక్తం పీల్చుతున్నారని అన్నారు.
