in ,

సత్యాన్ని చంపి.. ధర్మాన్ని చెరపట్టామని సంబరాలు చేసుకుంటున్నారు: లోకేశ్‌

nara lokesh

రాజమహేంద్రవరం: సత్యాన్ని చంపేసి.. ధర్మాన్ని చెరపట్టామని వైకాపా కాలకేయులు సంబరాలు చేసుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు..

అంతిమంగా గెలిచేది సత్యమేనన్నారు. మనం కాపాడిన ధర్మమే మనల్ని కాపాడుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రగతి ప్రదాత చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ చేపట్టిన సామూహిక నిరాహారదీక్షలపై సైకో జగన్‌ సర్కారు విరుచుకుపడిందని మండిపడ్డారు..

శ్రీకాళహస్తిలో శాంతియుతంగా దీక్ష చేపట్టిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం నియంతృత్వమని దుయ్యబట్టారు. కుప్పం, గుడిపల్లిలోనూ తెదేపా కేడర్‌పై తప్పుడు కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా అధినేత చంద్రబాబుకి సంఘీభావం ప్రకటిస్తున్నవారిపై సైకో జగన్‌ సర్కార్‌ అప్రకటిత యుద్ధం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులతో చంద్రబాబును కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. కోపతాపాలు వద్దు సంయమనం పాటించండి.. తెలుగుదేశం పార్టీ మీ వెనుక ఉందని శ్రేణులకు భరోసా ఇచ్చారు..

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Allagadda CM news

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author

భారీ వర్షానికి కొట్టుకుపోయిన కల్వర్టు

రాజౌరీలో ఎన్‌కౌంటర్‌.. ఓ ఉగ్రవాది హతం