- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మందసా తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.మోహన్ రావు మాట్లాడుతూ ధరలు తగ్గించాలని, ఉద్యోగాలు కల్పించాలని, విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం మందస తాసిల్దార్ బి. పాపారావు కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి దేవేంద్ర, టి.లక్ష్మీనారాయణ, కేశవరావు, సవర గురునాథ్, గణపతి, అప్పన్న, భీమారావు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]
