పాడేరు సెప్టెంబరు 30 : జిల్లాలోని కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా పౌర సంబంధాల అధికారి పి. గోవిందరాజులు శనివారం ఒక ప్రకటనలో తెలియజేసారు. అక్టోబరు 7 వ తేదీలోగా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయానికి పూర్తి చేసిన దరఖాస్తలు సమర్పించాలని పేర్కొన్నారు. అభ్యర్దుల పేరు, తండ్రిపేరు,పుట్టిన తేదీ, పూర్తి చిరునామా, కళారూపం, అనుభవం, కళాకారులుగా పొందిన దృవ పత్రాలు, ఫోన్నంబరు, ఆధార్నంబరు, ఈమెయిల్ అడ్రాసు తో దరఖాస్తు చేయాలని చెప్పారు.
This post was created with our nice and easy submission form. Create your post!