ఈనెల 29న అల్లూరి జిల్లా అనంతగిరి లో మండల స్థాయి జగనన్న కు చెబుదాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అనంతగిరి ఎంపీడీవో కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారని తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి మండలం స్థాయి అన్ని శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని కోరారు. మండల స్థాయి ప్రజలంతా ఈ కార్యక్రమంలో తమ సమస్యల్ని అధికారులు దృష్టిలో ఉంచి పరిష్కరించుకోవాలని సూచించారు.
This post was created with our nice and easy submission form. Create your post!