Viewing comment 1 (of 1 total)
  • పత్రికాప్రకటన తేదిః 19-09-2023
    కరీంనగర్ జిల్లా

    గణేష్ నిమజ్జనానికి పకడ్బంది ఏర్పాట్లు చేపట్టాలి
    మంత్రి గంగుల

    నిమజ్జన పాయింట్ల వద్ద క్రేన్, లైటింగ్, రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలి

    గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచాలి

    .
    . 0 0 0 0

    జిల్లాలో ఈ నెల 27,28 తేదీల్లో వైభవోపేతంగా గణేష్ నిమజ్జనం జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు..

    మంగళవారం పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు తో కలిసి వినాయక నిమజ్జనం జరుపే కొత్తపల్లి చెరువు,చింతకుంట కెనాల్ మరియు మానకొండూర్ చెరువులను సందర్శించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ట్ తో కలసి పరిశీలించారు.. ఈ సందర్భంగా నిమజ్జనం పాయింట్ల వద్ద రక్షణ కంచెలు, లైటింగ్, పెద్ద క్రేన్లు, చిన్న క్రేన్లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, నిమజ్జనం ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం, విద్యుత్ అంతరాయం కలిగినట్లయితే ఇబ్బందులు తలెత్తకుండా జనరేటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఘాట్ వద్ద పోలీస్, మున్సిపల్ సిబ్బంది, గజఈతగాల్లతో పాటు వాటంటీర్లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 27 రాత్రి నుండి 28వ తేది ఉదయం వరకు జరిగే నిమజ్జన కార్యక్రమం నిర్వహించే ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం సజావుగా జరిగడంతో పాటు నిమజ్జనం తరువాత విగ్రహలతో సమస్యలు తలెత్తకుండ తగిన చర్యలు తీసుకునేల ప్రతి నిమజ్జనం పాయింట్ వద్ద ఒక నోడల్ అధికారిని నియమించడం జరుగుతుందని తెలిపారు.చింతకుంటలో రెండు క్రేన్లు, కొత్తపల్లి లో రెండు, మాంకొందుర్ వద్ద తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో సిపి సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్ డి ఓ కె. మహేశ్వర్ డిపిఓ వీరబుచ్చయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి దేవేందర్, ఎసిపిలు కరుణాకర్ రావు, నరేందర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రుద్రరాజు, మానకొండూరు జడ్పిటిసి శేఖర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, పోలీస్,ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గోన్నారు.

Viewing comment 1 (of 1 total)